Quantcast
Viewing all articles
Browse latest Browse all 10

దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు పదిమంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్, ముమ్మర తనిఖీలు

హైదరాబాద్, ఫిబ్రవరి 21 : నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో గురువారం సాయంత్రం రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో పదిమంది దుర్మరణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు కొత్తపేటలోని ఓమ్నీ ఆస్పత్రికి తరలించారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్లలో జంట పేలుళ్లు జరిగినట్లు తెలియవచ్చింది.

పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఆ సమయంలో తొక్కిలాట జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో సంఘటనా ప్రదేశానికి చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో పవర్ కట్ చేశారు. వరుస పేలుళ్లతో అప్రమత్తమైన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది పోలీసులు నగరంలోని ముఖ్య ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


Viewing all articles
Browse latest Browse all 10

Trending Articles