Quantcast
Viewing all articles
Browse latest Browse all 10

తిరుచ్చిలో ఖుష్బూ బస చేసిన హోటల్‌పై చెప్పులతో దాడి!!

Image may be NSFW.
Clik here to view.

డీఎంకే చీఫ్ కరుణానిధి వారసత్వంపై ఖుష్బు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా సినీ నటి ఖుష్బూకు తమిళనాడు వ్యాప్తంగా నిరసన సెగలు ఎదురవుతున్నాయి. తాజాగా తిరుచ్చిలో ఆమె బస చేసిన ఒక హోటల్‌పై చెప్పులతో దాడి జరిగింది. అంతకుముందు చెన్నయ్ పట్టినంపాక్కంలోని ఆమె నివాసంపై డీఎంకేకు చెందిన కార్యకర్తలుగా భావిస్తున్న 15 మందితో కూడిన ముఠా దాడికి పాల్పడిన విషయం తెల్సిందే.

తమిళ వార పత్రిక జూనియర్ విగటన్‌కు ఆమె ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కరుణానిధి వారసత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన కరుణానిధి చిన్న కుమారుడు ఎంకే స్టాలిన్‌కు చెందిన వర్గీయులు ఆమె ఇంటిపై రాళ్లు రువ్వడంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.

మరోవైపు.. డీఎంకే నేత ఎంపీ తిరుచ్చి ఎన్.శివ గృహ శుభకార్యానికి ఖుష్బూ హాజరయ్యారు. ఆమె తిరుచ్చిలోని ఒక హోటల్‌లో బస చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు డీఎంకే కార్యకర్తలు ఆ హోటల్‌పై చెప్పులతో దాడి చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


Viewing all articles
Browse latest Browse all 10

Trending Articles