Quantcast
Viewing latest article 1
Browse Latest Browse All 10

ఐపీఎల్-6 వేలం : మాక్స్‌వెల్ రూ.5.1 కోట్లు రికీ పాంటింగ్ రూ.2.1 కోట్లు!

Image may be NSFW.
Clik here to view.
ఐపీఎల్-6 వేలం పాటలు చెన్నయ్‌లో ఆదివారం ప్రారంభంకాగా క్రికెటర్ మాక్స్‌వెల్ ధర రూ.5.1 కోట్లు, రికీ పాంటింగ్ ధర రూ.2.1 కోట్లు పలికింది. ఈ వేలం పాటల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ను దక్కించుకునేందుకు ముంబై ఇండియన్స్ జట్టు రూ.2.1 కోట్లను వెచ్చించింది.

అలాగే, ఆర్పీసింగ్‌ను రాయల్ ఛాలెంజర్స్ రూ.2.1 కోట్లకు కొనుగోలు చేసింది. దక్షిణాఫ్రికా క్రికెటర్ బోథాను రూ.2.39 కోట్లకు ఢిల్లీ డేర్ డెవిల్స్ చేజిక్కించుకోగా, మైకెల్ క్లార్క్స్‌ను రూ.2.12 కోట్లకు పుణె వారియర్స్ దక్కించుకుంది.

ఆస్ట్రేలియాకు చెందిన మరో ఆటగాడు లూక్ పోమర్స్‌బాచ్‌ను పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. మాక్స్‌వెల్‌ను ముంబై ఇండియన్స్ 5.1 కోట్లకు కొనుగోలు చేయగా, అభిషేక్ నాయర్‌ను పుణె వారియర్స్ రూ.3.5 కోట్లకు, శ్రీలంక బౌలర్ పెరెరాను 3.5 కోట్ల రూపాయలకు సన్‌రైజ్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.


Viewing latest article 1
Browse Latest Browse All 10

Trending Articles